
![]()
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 14 ఆగస్టు 2026: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కై రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభం. మొదటి రోజు నిరవధిక రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు. నిరవధిక రిలే నిరాహార దీక్ష లో పాల్గొని, మాట్లాడుతున్న తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట బుల్లెట్ రైల్వే కారీడార్ & రైల్వే స్టేషన్ సాధన అఖిలపక్ష కో- కన్వీనర్ అనంతుల మధు.
నిరవధిక రిలే నిరాహార దీక్ష లో ఈ రోజు పాల్గొన్న తెలంగాణ యువజన సంఘము నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీపంగు సునీల్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, జిల్లా నాయకులు చామకూరి మహేందర్, చెరుకు నగేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నిరవధిక రిలే నిరాహార దీక్ష కు ఈ రోజు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, జుట్టుకొండ సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, సామాజికవేత్త, విద్యావేత్త కొల్లు మధుసూధన్ రావు, కౌన్సిలర్ వూర రాంమూర్తి తదితరులు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, సామాజిక వేత్త పెద్ది రెడ్డి గణేష్ దీక్ష వీరమింప చేశారు.














