
![]()
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…
న్యూస్ 24అవర్స్ టివి-వరంగల్ ప్రతినిధి, 10 ఆగస్టు 2026: ఎస్.కె.ఆర్. కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు సూర్యాపేట జిల్లా ప్రజలకు ఉపయోగపడే రూ.14 లక్షల మహేంద్ర బొలెరో వైకుంఠ రధం వాహనం అక్షర ఫౌండేషన్ సభ్యులకు ఎస్.కె.ఆర్. కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంకినేని కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా సంకినేని కృష్ణారావు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అంత్యక్రియల సమయంలో వైకుంఠ రథ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాస్ మాట్లాడుతూ హాస్పిటల్లో చనిపోయిన మృతదేహాలను వారి గ్రామాలకు చేరవేయుట, అత్యవసర సమయములో మృతదేహాలను రవాణా చేయుట, సూర్యాపేట పట్టణం పరిసర ప్రాంత గ్రామాలలో దహన సంస్కారాలకు వైకుంఠ రథ సేవలు అందించుట, వీటితో పాటు డెడ్ బాడీ ఫ్రీజర్స్ కూడా 24 గంటలు ట్యాంక్ బండ్ దగ్గర గల హిందూ మహా ప్రస్థానం నందు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ వైకుంఠ రథ సేవలు సూర్యాపేట జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. మున్ముందు అక్షర సేవలు ఇంకా విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి, బత్తుల దామోదర్ రెడ్డి, ఉప్పల మధు, రమేష్, మందడి రమాదేవి, షేక్ నజీర్ భాష, బత్తుల ఉపేందర్, ధరావత్ వీరాసింగ్, రామకృష్ణ, గడ్డం వీరబాబు, జటంగి ముత్తయ్య, నాగరాజు, యాస అక్షయ్ రెడ్డి, వివేకానంద రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.












