Loading

గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

విలేకర్లు కావలెను: మా ప్రతినిధి లేని ప్రాంతంలో విలేకరి/రిపోర్టర్ కావలెను, ఆసక్తివున్నవారు 9490 999 316 ను సంప్రదించండి.

న్యూస్ 24అవర్స్ టివి-కడప/బద్వేల్ ప్రతినిధి, 03 ఆగస్టు 2026: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేల్‌కు చెందిన ఆదిలక్ష్మి (50) అనే మహిళ గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన ఆమె ముందుగా పేడ గా చల్లుకునే పురుగుల మందు (పౌడర్) తాగింది. అనంతరం పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు చేరుకుని అందులోకి దూకేసింది. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె అప్పటికే నీట మునిగి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న బద్వేల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *