Loading

గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్ & హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…

రోజులు మారాయి-సూర్యాపేట ప్రతినిధి, 10 సెప్టెంబర్ 2026: తెలంగాణ మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా వల్లపట్ల కృష్ణ నియామకం అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కృష్ణ 1997లో కుసుమవారిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులుగా, 2016 లో ఎం ఈ ఎఫ్ డివిజన్ కార్యదర్శిగా, 2017 లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, 2020 లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2024 నుండి ఇప్పటి వరకు సంఘ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో కృష్ణ సేవలను గుర్తించిన ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకత్వం సంయుక్తంగా వల్లపట్ల కృష్ణని రాష్ట్ర ఉద్యోగుల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఇటీవలే నియమించినట్లు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణకి పలువురు ఉద్యోగులు, స్నేహితులు, పట్టణ వాసులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *