
![]()
గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్ & హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…
రోజులు మారాయి-సూర్యాపేట ప్రతినిధి, 10 సెప్టెంబర్ 2026: మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులుగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చింత జాన్ విల్సన్ నియమితులయ్యారు. ఈయన 2014 లో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో బాగంగా అట్టి వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేసిన సమయంలో ఎంఈఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. 2005 లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జిగా, జిల్లా కార్యదర్శిగా, 2011 లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2016 లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2022 లో రాష్ట్ర కోశాధికారిగా పని చేసిన జాన్ విల్సన్ సేవలను గురించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ జాన్ విల్సన్ ని 2026 లో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఆయన నియామకం పట్ల పలువురు ఉద్యోగులు, స్నేహితులు, పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ ఎంఈఎఫ్ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగుల సంఘ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. తన నియామకాన్ని ధృవీకరించిన మంద కృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు.











