న్యూస్ 24అవర్స్ టివి-అమరావతి ప్రతినిధి, 29 జూన్ 2026: సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ సోమవారం అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అటకానితిప్ప-పెర్నాడు రహదారి నిర్మాణం,తడ మండలం వాటంబెడు వద్ద గ్రోయిన్ నిర్మాణం ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కి వివరించారు.అటకానితిప్ప-పేర్నాడు రహదారి నిర్మాణం ద్వారా ద్వీప ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు,విద్య, వైద్యం,అత్యవసర సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే వివరించారు.అలాగే వాటంబెడు వద్ద గ్రోయిన్ నిర్మాణం చేపట్టడం ద్వారా సముద్ర కోత నివారణ,తీర ప్రాంత రక్షణ,స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.సూళ్లూరుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *