***అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్…

న్యూస్ 24అవర్స్ టివి-మణుగూరు ప్రతినిధి, 29 జూన్ 2026: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో చోటు చేసుకున్నాయని వస్తున్న ఆరోపణలు, కార్డుల జారీలో అవకతవకలు, అక్రమాల పై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నా యని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం వార్తలు సేకరించి ప్రచురిస్తున్న పలువురు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కాకపోగా, తగిన సర్క్యులేషన్ లేదా ప్రచురణ ప్రమాణాలు లేని కొన్ని పత్రికలకు కూడా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నా యని పేర్కొన్నారు. జిల్లా పౌర సంబం ధాల అధికారి డిపిఆర్ఓ పర్యవేక్షణాలేమితో జర్నలిజాన్ని ప్రధాన వృత్తిగా నిర్వహించని కొందరు రాజకీయ నాయ కులు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, మద్యం దుకాణాల్లో పనిచేస్తు న్న వారికి కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోందని,

ఈ అంశాలపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని కోరారు. అంతేకాక అర్హతలపై సందేహాలు ఉన్న కొందరికి కార్డులు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించాలని, విచారణలో అక్రమాలు తేలితే అనర్హులకు జారీ చేసిన కార్డులను రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. అలాగే అన్యాయానికి గురైన అర్హులైన నిజమైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, భవిష్యత్తులో ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పాల్వంచ దుర్గ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై వినతి పత్రం అందించేందుకు జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్‌ఓ) కార్యాలయానికి వెళ్ళగా అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉదయం 11.20 గంటలు దాటినా డిపిఆర్ఓ, ఉద్యోగుల సీట్లు ఖాళీగా కనిపించడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అత్యవసర పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు, జర్నలిస్టులకు సంబంధిత అధికారి ఉద్యోగులు అందు బాటులో లేకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

విలేకర్లు కావలెను, సంప్రదించండి: 9290 999 316.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *