న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్, 15.06.2026: తెలంగాణ రాష్ట్రంలోని కేబుల్ టీవీ రంగానికి చెందిన జర్నలిస్టులు, నిర్వాహకులు, ఎంఎస్‌వోలు, సీఈఓలు ప్రతినిధుల సమక్షంలో కేబుల్ టీవీ రంగ సమస్యలు, అక్రిడిటేషన్ హక్కుల సాధనపై కీలకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథితులుగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి , జే ఏ సి ముఖ్య సలహాదారుడు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, టి జే ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, ఏ డబ్ల్యూ జే ఏ జాతీయ అధ్యక్షుడు కే కోటేశ్వర రావు, ఏం ఎస్ వో కోలా కిషోర్ గౌడ్ హాజరయ్యారు. సమావేశంలో కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా కేబుల్ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు, డిజిటల్ సాంకేతిక పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అలాగే రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో కేబుల్ టీవీ రంగానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరంపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ కేబుల్ టీవీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ అనేది ప్రతి జర్నలిస్టుకు మౌలిక హక్కు అని, కేబుల్ టీవీ రంగాన్ని కూడా ప్రధాన మీడియాగా గుర్తించి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సమావేశంలో పాల్గొన్న నాయకులు, జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు సాగితే మాత్రమే హక్కులను సాధించగలమని పిలుపు నిచ్చారు. కేబుల్ టీవీ రంగానికి బలమైన వేదికగా ఈ సమావేశం నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కేబుల్ టీవీ సంస్థలు, జర్నలిస్టులు కలిసి సంఘటితంగా పనిచేస్తూ తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. జేఏసీ కన్వీనర్లు బి.నరసింహ చారి, భరత్ కుమార్, డా మహ్మద్ యాసిఫ్ పాషా, పొదిళ్ళ వెంకట్, మహేష్ కుమార్ ఉపాధ్యాయ, రాచర్ల గోపి, డా బాను ప్రసాద్, పీట్ల ప్రతాప్, జితేందర్, శ్రీనివాస్, వేణుగోపాల్, కలీమ్, బ్రహ్మం, నాయిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *