Loading

గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి ప్రతినిధి, 26 జులై 2026: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ 311, 312 పోలింగ్ కేంద్రాలలో ఆదివారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల అధికారులు మరియు ప్రతినిధులతో కలసి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమ పర్యవేక్షకులు, తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంత శాతం మేర ఓటర్ల సమాచారాన్ని నమోదు పత్రాల్లో పూర్తి చేశారనే వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 312వ పోలింగ్ కేంద్రంలో నిర్దేశిత ప్రక్రియను చాలా త్వరితగతిన పూర్తి చేసిన అధికారులను, ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలింగ్ కేంద్ర అధికారి (బి.ఎల్.ఓ) ఫరీదా ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గాదరబోయిన లింగయ్య, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎల్సోజు నవీన్, కాంగ్రెస్ నాయకులు బేతు సోమయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు కొల్లోజు కళ్యాణ్, కొమర మల్లు, వార్డు నాయకులు మహేందర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *