***ఈ కార్యక్రమంలో ఓటరు అవగాహనపై BLA లకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు…

న్యూస్ 24అవర్స్ టివి-ఖమ్మం ప్రతినిధి, 30 జూన్ 2026: తల్లాడ మేజర్ పంచాయతీ మరియు తల్లాడ మండల స్థాయిలో SIR కార్యక్రమం పై BLA లకు అవగాహన కార్యక్రమం మిట్టపల్లి గ్రామంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటరు నమోదు మరియు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మ్యాపింగ్ ఫార్మ్స్ విషయంలో BLA లు అప్రమత్తంగా వ్యవహరించి, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున BLA లు పాటించాల్సిన విధానాలు, బాధ్యతలపై వివరంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సెక్రటరీ లు, BLA లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, తల్లాడ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ, సత్తుపల్లి, మధిర కేంద్రాల్లో విలేకర్లు కావలెను. Call:9490 999 316.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *