Loading

గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి, ఇతరులకు షేర్ చేయండి…

న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 17 జులై 2026: సర్ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సూరారం కాలనీలో బస్ స్టాప్ లో, ఫస్ట్ హోం జెండా సెకండ్ హోమ్ జెండా, సూరారం ఎక్స్ రోడ్, ప్రాంతాలలో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మీరు తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకోవాలని భవిష్యత్తులో ఓటు ఆధార్ లింక్ చేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడు మనకు ఇబ్బంది జరగవచ్చు అని వారికి అవగాహన కల్పిస్తున్న సామాజిక పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని మీ సేవ ఆన్లైన్ లో చేసుకోవాలని మీ ఇంట్లో సెల్ స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే మీ పిల్లల ద్వారా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చని, సొంతంగా స్కెచ్ పెన్ తో కాటన్ బట్ట పై వ్రాసి బ్యానర్ తో ప్రచారం చేయడం, సొంత మైకుల ద్వారా రికార్డు చేసి అక్కడక్కడ చౌరస్తాలో మైకు ద్వారా వినిపించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో 60 గజాల శ్యామ్, గుట్ట అశోక్, ఆర్ లక్ష్మీనారాయణ, జి రమేష్, రాజు, ఆంజనేయులు, దేవి రెడ్డి మొదలగువారు మరియు సీనియర్ సిటిజన్ తో పాటు, యువకులు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారాన్ని చూసి ప్రజలు వారి సెల్ఫోన్లో బంధించడం, ఇతరులకు పంపడం గర్వకారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *