
![]()
***ప్రెస్ మీట్లో ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్…
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…
న్యూస్ 24అవర్స్ టివి-హనుమకొండ ప్రతినిధి, 16 జులై 2026: క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ.. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (NGS) సదుపాయాన్ని ప్రారంభించింది. గురువారం నాడు హనుమకొండ యశోద క్లినిక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రెసిషన్ ఆంకాలజీతో మెరుగైన ఫలితాలు ప్రస్తుతం వైద్యరంగం సాంప్రదాయ “అందరికీ ఒకే రకమైన చికిత్స” విధానం నుండి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ (ఖచ్చితమైన వైద్యం) వైపు వేగంగా అడుగులు వేస్తోందని డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు. ఆధునిక చికిత్సలైన టార్గెటెడ్ ఓరల్ థెరపీలు, ఇమ్యూన్ చెక్పాయింట్ ఇన్హిబిటర్స్ వంటివి రోగుల జీవనకాలాన్ని, వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతున్నాయని, ఇందుకు జన్యు విశ్లేషణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
‘ఇన్-హౌస్ NGS’ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు,
వేగవంతమైన నివేదికలు: ఆసుపత్రి ప్రాంగణంలోనే (ఇన్-హౌస్) ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల రోగి యొక్క జన్యుపరమైన మార్పులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చు.వ్యక్తిగతీకరించిన చికిత్స: పరీక్షా ఫలితాల ఆధారంగా ఆంకాలజిస్టులు ప్రతి రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చికిత్సను డిజైన్ చేయడానికి వీలవుతుంది.
ప్రధాన క్యాన్సర్లకు మేలు: ముఖ్యంగా ఊపిరితిత్తుల (Lung), రొమ్ము (Breast), జీర్ణాశయ సంబంధిత (Gastrointestinal) క్యాన్సర్లతో పాటు ఇతర కణితుల (Tumors) చికిత్స నిర్ణయాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.”సొంతంగా ఎన్ జి ఎస్ సదుపాయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రెసిషన్ ఆంకాలజీ విభాగంలో యశోద హాస్పిటల్స్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. అత్యాధునిక సాంకేతికతను రోగులకు మరింత వేగంగా, చేరవ చేయడమే మా లక్ష్యం” అని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.
ఒకే గూటి కింద ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్లో ఇప్పటికే అనుభవజ్ఞులైన మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ నిపుణుల బృందం, అత్యాధునిక రోబోటిక్ ఆంకోసర్జరీ, దేశంలోనే తొలి రేడియేషన్ థెరపీ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి ‘NGS’ సదుపాయం తోడవడంతో క్యాన్సర్ రోగులకు ఒకే చోట పూర్తిస్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలు లభించనున్నాయి.
ఈ విలేకరుల సమావేశంలో హాస్పటల్ సిబ్బంది సాయి వెంకట్, విజయ్ కుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.












