Loading

గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 01 ఆగస్టు 2026: దీర్ఘకాలంగా పశుసంవర్ధక శాఖలో విశిష్ట సేవలు అందించిన శ్రీనివాసరావు పదవీ విరమణ పొందిన సందర్భంగా శాఖ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావంతో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

జిల్లాలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించడంలో శ్రీనివాసరావు పాత్ర ఎంతో కీలకమైందని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగుతానని చెప్పారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ అందించిన సహకారం మరవలేనిదని శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్దక అధికారి బి శ్రీనివాస రావు, డా, చిట్టి అంజలప్ప, డా: పురంధర్ రావు, డా: కిరణ్ కుమార్, డా: జైన్, రూప కూమార్, కిషోర్, సహయ సంచాలకులు, పశువైద్య అధికారులు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *