Loading

హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఆదివాసీ యువతి ఊకే శిరీషపై జరిగిన అత్యాచారం, అనంతరం జరిగిన హత్య ఘటనను NCP పార్టీ–NDA మహాకూటమి–NYC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు తీవ్రంగా ఖండించారు. తాజా సమాచారం ప్రకారం పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కాగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన అత్యంత దారుణమని, ఆదివాసీ మహిళలు మరియు యువతుల భద్రతపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మద్దిశెట్టి సామేలు పేర్కొన్నారు.

శిరీష కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేసును వేగంగా దర్యాప్తు చేసి, చట్ట ప్రకారం నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలోని ఆదివాసీ మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళలు పనిచేస్తున్న ఆసుపత్రులు, హాస్టళ్లు మరియు ఇతర ప్రదేశాల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.

ఈ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (NCST), జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గార్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ తరఫున లేఖలు సమర్పించనున్నట్లు మద్దిశెట్టి సామేలు తెలిపారు.

శిరీష కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మద్దిశెట్టి సామేలు హామీ ఇచ్చారు.

ఇట్లు,
మద్దిశెట్టి సామేలు
జాతీయ కార్యవర్గ సభ్యులు
NCP పార్టీ – NDA మహాకూటమి NYC

#bhadradrikothagudemnews

#telanganaspeednews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *