
![]()
ములకలపల్లి: ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీష హైదరాబాద్లోని ప్రేమ్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ మానభంగానికి గురై, తీవ్ర గాయాలతో మృతి చెందారు. శిరీష పార్థివదేహాన్ని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. శిరీషపై మానభంగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సన్నద్ ఉల్లా ఖాన్పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, పార్కలగండి సర్పంచ్ సుశీల మాజీ సర్పంచ్ వాడే నాగరాజు , చెన్నయ్య, కరటూరి కృష్ణ, పామర్తి వెంకటేశ్వరరావు, చల్ల వెంకటేశ్వర్లు, దేవ స్వామి బైటి రాజేష్, పోడియం ప్రేమ్, రింగ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు..
#telangananews #aswaravpetnews











