
![]()
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 27 జులై 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, నెట్వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత, రాయితీ వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.












