న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్ ప్రతినిధి, 07 జులై 2026: డా.పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కు తెలంగాణ దళిత క్రైస్తవ రాష్ట్ర నాయకులు మంగళవారం హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు బిషప్ దుర్గం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ 1965 జూలై 7న యల్లయ్య గా జన్మించిన మంద కృష్ణ మాదిగ అణగారిన మాదిగ సమాజం యొక్క హక్కుల కోసం పోరాడిన కార్యకర్త అతను 1980లలో కుల వ్యతిరేక కార్యకర్తగా ఉండి, 1994 లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపింఛీ అతని కార్యకలాపాలలో కుల వివక్ష, పిల్లల ఆరోగ్యం మరియు ఉచిత గుండె ఆపరేషన్, వికలాంగుల హక్కుల పోరాటం కొరకు ఉద్యమం చేసి. కారంచేడు (1985) మరియు చుండూరు (1991) మారణకాండల తర్వాత బలం పుంజుకొని విస్తృత పోరాటం చేసిన గొప్ప నాయకులు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో చింతాడ ఆనంద్ విషయంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఎత్తివేయడంపై దేశవ్యాప్తంగా దళితులకు జరుగుచున్న అన్యాయంపై ప్రస్తుతం దళిత క్రైస్తవ ఉద్యమంనకు ఊపిరి పోసిన డా.పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుగు సంసోన్, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *