***దామన్న కల నేడు సాకారం…
***ఆర్డిఆర్ భవనంగా నామకరణం చేస్తాం…
***సంవత్సరంలోపు భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం…

సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-24.03.2026:
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కాంగ్రెస్ భవనానికి స్థల కేటాయింపుకై ఎన్ని మార్లు విన్నవించిన పట్టించుకోలేదని విమర్శిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మానానికి కేటాయించిన స్థలాన్ని మంగళవారం పరిశీలించిన ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పూర్వ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ లు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం మాజీ మంత్రి దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి కల అని అది నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో సాకారమైదని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పూర్వ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని ఏడు జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు భవన నిర్మాణానికి స్థల కేటాయింపులు చేయగా అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డులో కేటాయించిన ఎకరం స్థలాన్ని భవన నిర్మాణం కోసం పరిశీలించి మాట్లాడారు. కుడ కుడ రోడ్డులోని 126 సర్వే నెంబర్ లో జిల్లా కాంగ్రెస్ భవన నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలని దామన్న అనుకున్నారని ఆయన ప్రారంభించిన ప్రక్రియ నేడు అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని ఎన్నిమార్లు విన్నవించిన వారి పార్టీకి మాత్రమే భవనాలకు స్థలాలు కేటాయించుకున్నారు తప్ప తమ నాయకుని విన్నపాన్ని పట్టించుకోలేదన్నారు.

జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకపోవడంతో కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలంటే నాయకుల నివాసాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నేడు అలాంటి పరిస్థితి లేకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, ఐ ఎన్ టి సి, సేవాదళ్ లకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంవత్సరం పూర్తయ్యేలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆర్డిఆర్ భవనంగా నామకరణం చేసుకుందామన్నారు. ఈ విషయమై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్లతో కలసి విన్నవించడంతో పాటు త్వరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహింపజేసి దామోదర్ రెడ్డి భవనంగా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.












