బ్యూరో చీఫ్, న్యూస్ 24అవర్స్ టివి-24.03.2026: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు,(ఎలియాస్ సున్నం చంద్రయ్య) పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రూ. 25 లక్షల రివార్డు.. భారీ వ్యూహం పాపారావుపై ప్రభుత్వం రూ. 25 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. ఆయన లొంగుబాటుకు సంబంధించి ఇప్పటికే మధ్యవర్తులు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

సుమారు 12 నుంచి 17 మంది తన సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. భద్రతా బలగాలు ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే, మరోవైపు మావోయిస్టు నేతలు లొంగిపోయేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ పరిణామాలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దృఢ సంకల్పంతో దేశంలో నక్సలిజంపై పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగు తోంది. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పాపారావు వంటి అగ్రశ్రేణి కమాండర్లు లొంగిపోవడం ఒక సానుకూల సంకేతం.

నక్సలిజం నిర్మూలనకు గడువు దగ్గర పడింది.అని ఆయన పేర్కొన్నారు. అధికారిక ప్రకటన కోసం నిరీక్షణ పాపారావు లొంగుబాటుపై పోలీసు ఉన్నతాధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించా ల్సి ఉంది. ఆయన లొంగి పోతే బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు పూర్తిగా సడలే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *