Loading

***​హైదరాబాద్ గాంధీ భవన్‌కు భారీగా తరలిన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కాంగ్రెస్ నాయకులు…

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి ప్రతినిధి,12 జులై 2026: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి కేవలం స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్‌తోనే సాధ్యమవుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశాయి. అంబేద్కర్, పూలే విగ్రహాలకు ఘనంగా నివాళు లర్పించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డితో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సమావేశం. ఈ నేపథ్యంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో ఘనంగా ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు దేశ మహోన్నత నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే మన ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమం అనంతరం తిరుమలగిరి మండలం నుండి కాంగ్రెస్ శ్రేణులు వాహనాల్లో భారీ ఎత్తున హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు తరలివెళ్లారు.

ఈ ​కార్యక్రమంలో ​పట్టణ అధ్యక్షుడు పేరాల వీరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జమిలాల్, మీడియా ఇంచార్జ్ ​కందుకూరి లక్ష్మయ్య, ​బత్తుల శ్రీనివాస్,​తిరుమణి యాదగిరి, ​పేరాల నరేష్, ​దానయ్య, ​వీరితో పాటు నియోజకవర్గ పరిధిలోని 16 గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివెళ్ళారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *