న్యూస్ 24అవర్స్ టివి-సికింద్రాబాద్, 17.06.2026: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఆగస్టు 2న నిర్వహణ. జులై 19న ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలకు శ్రీకారం. ఆగస్టు 2న అమ్మవారికి బోనాల సమర్పణ. ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి) కార్యక్రమం. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వివరాలను ప్రజాప్రతినిధులకు అందజేసిన ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి. నెలరోజుల్లో నగరంలో మొదలుకానున్న బోనాల జాతరలు. హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాలు ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ పండుగలో మొదటి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. తొలి గురువారం లేదా ఆదివారం నాడు గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి పూజ చేసి,మొదటి బోనాన్ని సమర్పిస్తారు. వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం.. కుమ్మరి సంఘానికి చెందిన మహిళలు అమ్మవారికి మొట్టమొదటి బోనాలు సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *