నాయుడుపేట పట్టణంలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద నిర్మిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ ఆదవరం నాగురయ్య, హాస్పిటల్ డాక్టర్లు ఆదవరం సందీప్, ఆదవరం అనుదీప్ లు నాయుడుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి పేదల పక్షపాతిగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు విరాళం ఇవ్వడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *