కోదాడ ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-12.03.2026: పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, స్కెల్స్, ఏరైజార్స్, పెన్సిల్స్, శాప్సనార్స్ లను బేతెస్థ ఫౌండేషన్ చైర్మన్ దుర్గం కరుణశ్రీ ప్రభాకర్ గురువారం అందజేశారు. మునగాల మండల కేంద్రంలోని ట్రినీటి హై స్కూల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పంపిణీ అనంతరం

బేతెస్థ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ పరీక్షలు బాగా రాసి 100 కి 100 శాతం మార్కులు సాధించాలని మరియు ట్రినీటి హై స్కూల్ పాఠశాలకు, టీచర్స్ కు తల్లి తండ్రులకు మంచి పేరును తీసుకురావాలని భవిషత్ లో ఉన్నత స్థాయికి చేరాలంటే పదవతరగతి మార్కులు ఎంతో ఉపయోగపడతాయనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థపకులు బిషప్ దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మల్లంగి వనజ, ప్రిన్సిపాల్ డా. ముల్లంగి జాకబ్ రాజు, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *