టీమిండియా 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం ఇద్దరు వ్యక్తులకు అంకితం చేస్తున్నానని చెప్పాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్. తన కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన వ్యక్తుల్లో జై షా కూడా ఉన్నారని గంభీర్ వెల్లడించాడు. న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ చరిత్రలో మూడో టీ20 వరల్డ్ కప్ను సాధించింది.
2026-03-09


