

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్చెరు ప్రతినిధి, 02.06.2025: పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ మరియు నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతల ఆరాధన ద్వారా గ్రామానికి శాంతి, సమృద్ధి కలుగుతుందని, ఇలాంటి మహోత్సవాలు గ్రామీణ ప్రజల భక్తి, భౌతిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందన్నారు.
5,909 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




