

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్చెరు ప్రతినిధి, 02.06.2025: పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఎల్లమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ మరియు నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ దేవతల ఆరాధన ద్వారా గ్రామానికి శాంతి, సమృద్ధి కలుగుతుందని, ఇలాంటి మహోత్సవాలు గ్రామీణ ప్రజల భక్తి, భౌతిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ పెరుగుతుందన్నారు.
