ఫుడ్ & హెల్త్ ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-23.03.2026: పురుషుల్లో ప్రోస్ట్రేట్ గ్రంధి పెరుగుదల సమస్యకు నీటి ఆవీరి చికిత్స (వాటర్ థెరపీ) ను విజయవంతంగా నిర్వహించినట్లు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి ఎండి చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సి మల్లికార్జున తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఈ చికిత్సను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ క్రమంలో కొత్తగా ప్రత్యేక పరికరం ద్వారా నీటి ఆవిరిని ఇంజక్షన్ రూపంలో మూత్రశయ నాళాల నుండి ప్రోస్టేట్ వరకు పంపిస్తారు. ఆవిరిశక్తి ప్రోస్ట్రేట్ కణాల పెరుగుదలను తగ్గించి రోగికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ చికిత్స 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. 30 నుండి 100 గ్రాముల్లో పెరుగుదల ఉన్న వారికి మాత్రమే ఇది మెలు చేస్తుంది.
2026-03-23












