సూర్యాపేట ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-21.03.2026: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది ముస్లిం సోదరులతో కలసి ప్రత్యేక నమాజ్‌లో పాల్గొని, వారితో ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ మున్సిపాలిటీ లో లేని విధంగా సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో లో 6 కౌన్సిలర్ సీట్లను మైనార్టీలకు ఇవ్వడం జరిగిందాని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ, ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *