బ్యూరో చీఫ్, న్యూస్ 24అవర్స్ టివి-03.04.2026: ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం పెట్రో భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు శుక్రవారం నుంచి తక్షణమే అమల్లోకి వచ్చాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌లో తాజా పెంపుతో లీటర్ హై-స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 184.49 (54.9 శాతం) పెరిగి రూ. 520.35కు చేరింది. అదేవిధంగా, పెట్రోల్ ధర లీటర్‌పై రూ. 137.23 (42.7 శాతం) పెరిగి రూ. 458.40కు ఎగబాకింది. నెల రోజుల వ్యవధిలో పాకిస్థాన్‌లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *