
—ఆయన ఆశయాలు స్పూర్తిదాయకం…
—చిట్కుల్ లో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి…

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు, 11.04.2025: మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలె చిత్ర పటానికి నీలం మధు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహనీయుడు ఫూలే అన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, ఆశలకు అనుగుణంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దశాబ్దాలుగా ప్రజల న్యాయబద్ధ డిమాండ్ లైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316