ఆసియా ఖండంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి రైతుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని బిల్డర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు యెల్గూరి పాండు గౌడ్ తెలిపారు. మంగళ వారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఐదు రూపాయలకు అన్నపూర్ణ భోజనంతో పాటు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మార్కెట్ కు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఉచితంగా ప్రతిరోజు అల్పాహారం కూడా పంపిణీ చేయించడం గర్వకారణమన్నారు. మునుముందు ఎన్నో పదవులు అధిరోహించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కొనియాడారు. వీరి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *