హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-14.03.2026: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, హైకోర్టు న్యాయవాది కరుణాకర్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా సన్మానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుడు దేశాయి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి కేశవరావు, మధుయాస్కి, బిజెపి నుండి వెంకట్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నుండి గోవర్ధన్, చెరుకు సుధాకర్, పాశం యాదగిరి, చీమ సుధాకర్, సినిమా హీరో రఫీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు, ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమకారుల తరఫున కేసును వాదించి హైకోర్టు ఆర్డర్ ను తెచ్చిన కరుణాకర్ రెడ్డి కి ఉద్యమకారులు మరియు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *