రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్‌ 23వ తేదీ వరకు తరగతులు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *