తిరుపతి ప్రతినిధి, న్యూస్ 24అవర్స్ టివి-23.03.2026: శెట్టి బలిజ జాతి పితామహుడు, సామాజిక సేవకుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు శ్రీ దొమ్మేటి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన సేవలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి సమాజం అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి, విద్య, సామాజిక చైతన్యం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), శ్రీ శ్రీనివాసులు (క్రైమ్స్), శ్రీ శ్రీనివాస రావు (సాయుధ దళం), ఎస్‌బీ డీఎస్పీ శ్రీ వెంకటనారాయణ, శ్రీ చంద్రశేఖర్ (సాయుదళం డియస్పి)ఏవో శ్రీ సురేష్ కుమార్ మరియు డీపీవో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *