
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 17 సెప్టెంబర్ 2026: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజనాల శ్రీహరి కి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ ల జేఏసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజనాల శ్రీహరి కి అవకాశం కల్పించాలని కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన పూర్వ, ప్రస్తుత పట్టభద్రులు, పరిశోధక విద్యార్థులం. రాబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికలలో రాజనాల శ్రీహరి కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కి, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి, శ్రీమతి సోనియా గాంధీ, కె.సి. వేణుగోపాల్ కి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కాంగ్రెస్ ప్రదేశ్ మీనాక్షి నటరాజన్ కి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఈ లేఖ రాస్తున్నామని పేర్కొన్నారు.

రాజనాల శ్రీహరి విశిష్టత: 1). 35 సంవత్సరాల నిర్విరామ పార్టీ సేవ. శ్రీహరి గత 35 సంవత్సరాలుగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా చేరి, NSUI నుండి నేటి వరకు పార్టీ కష్టసుఖాల్లో వెన్నంటి ఉన్నారు. పదవులు, అధికారం లేకపోయినా పార్టీ జెండాను వదలని నిఖార్సయిన కాంగ్రెస్ వాది.
2). గెలిచే అభ్యర్థి: కాకతీయ యూనివర్సిటీ బిడ్డ లో PG పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినారు కాబట్టి పట్టభద్రుల సమస్యలు, యూనివర్సిటీ సమస్యలు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఇది పట్టభద్రుల నియోజకవర్గానికి అత్యంత అవసరమైన అర్హత.
3). పట్టభద్రులు, నిరుద్యోగులకు అండ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుండి నేటి గ్రూప్-1, గ్రూప్-2, DSC, SI, కానిస్టేబుల్ నోటిఫికేషన్ల సాధన వరకు ప్రతీ ఉద్యమంలో ముందున్నారు. పేపర్ లీకేజీలపై, ఉద్యోగ జాప్యంపై ప్రభుత్వాలను నిలదీసిన గొంతుక.
4)l:: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లోని లక్షలాది మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువతతో ఆయనకు వ్యక్తిగత పరిచయం, మంచి పేరు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుంది.

కావున, పెద్ద మనసుతో ఆలోచించి, 35 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవలందిస్తున్న, కాకతీయ యూనివర్సిటీలో PG పూర్తి చేసిన విద్యావంతుడు, పట్టభద్రుల ఆత్మబంధువు అయిన రాజనాల శ్రీహరి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి, మా గొంతుకను శాసన మండలిలో వినిపించేలా చేయగలరని వేడుకుంటున్నాము. కేయూ జాక్ టెక్నికల్ వింగ్ ఎక్స్ ప్రెసిడెంట్ వినోద్ లోక్ నాయక్, ఓయూ జాక్ వెంకట్ గల్లా వెంకట్ తదితరులు తెలిపారు.
