
గుడ్ న్యూస్: మనసు ప్రశాంతంగా లేనప్పుడు www.news24hourstv.com పై క్లిక్ చేసి వండర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్&హెల్త్, ఆర్టికల్స్, చట్టం-న్యాయం, సినిమా పేజీలను చదివి ప్రశాంతతను ఆస్వాదించండి, సబ్ స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి…

న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 13 సెప్టెంబర్ 2026: వినాయక చవితి సందర్భంగా మట్టి గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా మన పర్యావరణాన్ని పరిరక్షించడం లో మన వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి ఒక ప్రకటన ద్వారా భక్తులను కోరుతున్నారు. రసాయనాలతో తయారైన విగ్రహాలను చెరువులు, నదులు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై, జలచరాలకు మరియు ప్రకృతికి హాని కలుగుతుంది.
నీటిని కలుషితం చేస్తే ప్రకృతి తన విశ్వరూపాన్ని ఎలా చూపిస్తుందో మనం ఎన్నో సందర్భాల్లో కళ్లారా చూశాం. అందుకే రాబోయే తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలంటే మట్టి గణపతికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి వనరులను కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి. ఈ వినాయక చవితికి సిద్ధి వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజిద్దాం. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న చీకూరి లీలావతి.
