
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 15 ఆగస్టు 2026: స్థానిక వ్యాపారుల దుకాణాలను ఆదరించాలని వారి వద్దనే మనకు అవసరమైన సరుకులను, వస్త్రాలను, కొనుగోలు చేయాలని పట్టణ కాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అసోసియేషన్ భవనం వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వ్యాపారాలను చాలామంది వదులుకోలేక పెట్టుబడులు పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారికి పట్టణ ప్రజలు అండగా నిలవాలని అన్నారు. మనకు అవసరమైన వస్త్రాలను పండగల సమయంలో కొనుగోలు చేసి మన స్థానిక వ్యాపారులకు ఉపాధి కల్పించాలని అన్నారు. స్థానిక వ్యాపారులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారని కాబట్టి మనం కూడా వారికి అండగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి శంకర్, జిల్లా కార్యదర్శి మొరిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి సింగిరి కొండ రవీందర్, కర్నాటి సురేందర్, ఈగ వెంకటేశ్వర్లు, కోమలి యాదగిరి, అనంతుల రాజా, పిఆర్వో పాపని యాదిగిరి, తేలుకుంట్ల వెంకన్న,, గుంటి మధుసూదన్, ఎలగందుల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.