
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 15 ఆగస్టు 2026: సూర్యాపేట పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న అరబీ మదరసా మదీనతుల్ ఉలూమ్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ-సూర్యాపేట ఆధ్వర్యంలో మదరసా విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు, న్యాయవాది ఎం.డి. ఖాలేద్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి, నైపుణ్యం మరియు ఏకాగ్రతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ దేశంలో డాక్టర్లు, ఇంజనీర్ లు, యాక్టర్ లు ఉన్నారని, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే, అవినీతి రహిత పాలన అందించే నాయకులు కరువు అవుతున్నారని, విద్యార్థి, యువత చదువుతో పాటు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మైనార్టీ యువత, విద్యార్థులకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై బాసిద్, రిటైర్డ్ ఎస్సై రషీద్ ఖాన్ , రిటైర్డ్ ఎస్సై అబ్దుల్లా , రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి గయాజ్ భాయ్, మదరసా నిర్వాహకులు హాఫిజ్ తాహెర్ , మౌలానా అబ్రార్, యాసిర్, నాసిర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
