
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 12 ఆగస్టు 2026: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో రెండు మృతదేహాలను పూడ్చిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మోతె మండల కేంద్రంలో వ్యవసాయ భూమిలో అనుమానస్పద స్థితిలో భార్యభర్తల మృతదేహాలు లభ్యం.

సమాచారం అందుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, మోతె ఎస్సై లచ్చిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన వెంటనే హుటా హుటిన బయలు దేరిన సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మోతే మండల కేంద్రము సమీపంలో జాతీయ రహదారి వెంట కాళ్ళు చేతులు కనిపించేలా భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మగ, ఆడ మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మృతదేహాలకు సంభందించిన సమాచారాన్ని స్థానిక ప్రజలు సంచారం ఇవ్వగానే డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృషా రెడ్డి, స్థానిక ఎస్ఐ, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతి దేహాలను వెలికితీయడం జరిగినది.

మృతులు బీక్యాతండా కు చెందిన బూబా, నాగు గా గుర్తించడం జరిగినది, మోతే మండలం బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు, బూబా లు భార్యాభర్తలు పొట్టకూటికోసం మోతే మండల కేంద్రానికి వచ్చి కొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసుకుంటూ రెండు సంవత్సరాలుగా మోతే మండల కేంద్రంలోని నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తల మీద కొట్టి వారిని హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పాతిపెట్టినట్టుగా ఆనవాళ్లు ఉన్నట్లు ఎస్పీ నర్సింహా తెలిపారు. దీనిపై మోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశాము, ఎవరైనా కొట్టి చంపి ఇక్కడకు తెచ్చి పూడ్చి ఉంటారు అనే కోణంలో విచారణ చేస్తున్నాం, సంఘటనకు పల్పడ్డవారిని పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
