
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 27 జులై 2026: ఏపీలో తాజాగా 10 కరోనా కేసులు నమోదు. గుంటూరులో 3, ఎన్టీఆర్లో 2, అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాలలో ఒక్కో కేసు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరినట్లు వైద్య శాఖ వెల్లడి. 24 మంది ఆసుపత్రుల్లో, 16 మంది ఇళ్ల వద్ద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స. ఇతర కారణాలతో నలుగురు కరోనా బాధితులు మృతి చెందినట్లు తెలిపిన వైద్య శాఖ.

తిరుపతిలో మొదటి కరోనా కేసు. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్. ఈనెల 23న కరోనా పరీక్ష చేయగా 24న పాజిటివ్ గా నిర్ధారణ. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించడంతో ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించ లేదని జిల్లా వైద్యశాఖ వెల్లడి.