
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి ప్రతినిధి, 26 జులై 2026: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది.

అధ్యక్షులుగా ఉయ్యాల వీరేశం, ఉపాధ్యక్షులుగా చిన్నగాని శ్రీహరి, కోశాధికారిగా ధరావత్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా మన్నూరు సోమన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేస్తామని, మండలంలోని హోటల్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మమ్ముల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న హోటల్ యాజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతకింది మురళి, సలహాదారులు కాసారపు సంజీవరెడ్డి, సిరివేరు రవికుమార్, కుదురుపాక రాములు, వాడపల్లి వెంకన్న, స్వామి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
