
గమనిక: మనసు ప్రశాంతంగా లేనప్పుడు news24hourstv.com పై క్లిక్ చేసి అందులోని Wonders, Lifestyle, Food & Health, Articles పేజీలను ఓపెన్ చేసి చదవండి, ప్రశాంతతను ఆస్వాదించండి…

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి ప్రతినిధి, 26 జులై 2026: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి టౌన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన పూర్తిగా వ్యక్తిగత విభేదాల వల్లే జరిగిందని, దీనితో ఏ రాజకీయ పార్టీకిగానీ, ఏ రాజకీయ నాయకుడికిగానీ ఎలాంటి ప్రమేయం లేదని ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కందుకూరి అంబేద్కర్ మరియు వారి సంబంధీకుల మధ్య కొద్దిరోజులుగా ఉన్న వ్యక్తిగత, కుటుంబ విభేదాల కారణంగానే ఆదివారం పరస్పరం గొడవ జరిగిందని ఎస్సై తెలిపారు. కేవలం స్వల్ప కారణాలతో జరిగిన ఈ ఘటనను కొందరు అనవసరంగా రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనకు రాజకీయ రంగు పులిమి ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం వారి మధ్య ఉన్న అంతర్గత విషయమని, ప్రజలెవ్వరూ పుకార్లను నమ్మవద్దని, పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఎస్సై వెంకట్ రెడ్డి కోరారు.