
న్యూస్ 24అవర్స్ టివి-సినిమా, 11 జులై 2026: గానకోకీల జానకి మృతి. మైసూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2026 జూలై 11వ తేదీ శనివారం చనిపోయిన సింగర్ జానకి. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సింగర్ జానకి. కొన్ని రోజుల క్రితమే అమెరికాలో మనుమడు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సింగర్ జానకి మృతి.

పేరు: శిష్ట్లా జానకి,
జన్మ: 23 ఏప్రిల్ 1938, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధ పేరు: గానకోకిల, జానకమ్మ.
70, 80 దశకాల్లో ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్, కె.వి. మహదేవన్ లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసి సూపర్ హిట్స్ ఇచ్చారు.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దది.
మొత్తం 48,000 పాటలకు పైగా రికార్డ్ చేశారు. ఇది గిన్నిస్ రికార్డ్ కూడా.
జానపదం పాడితే "లయ సరిగ్గా కుదిరింది" అనేవారు. శాస్త్రీయం పాడితే "పండితులు మెచ్చుకునేవారు". భక్తి పాడితే కళ్లు చెమ్మగిల్లేవి.
కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అన్ని అవార్డులు వచ్చినా "నేను ఒక సాధారణ గాయని ని" అని చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం.

తెలుగులో: ఏటికి ఎదురీదని, ఇది మల్లెల వేళ, పిల్ల జమిందార్, అబ్బా ఏమిదో,
తమిళ్ లో: మచ్చనే పార్తు, ఇలయ నిలా,
కన్నడలో: నా నిన్న బిడలారే.
ప్రతి పాట వెనుక ఒక భావం, ఒక జీవితం కనిపిస్తుంది.
ఎస్. జానకి గారు శరీరంతో లేకపోయినా, ఆమె గొంతు ఉన్నంత కాలం మనతోనే ఉంటారు. ఆమె పాటలు అంటేనే మన అమ్మల లాలి, మన ప్రేమ కథలు, మన పండగలు.
"గానకోకిల" కు నివాళి. ఓం శాంతి"…