
న్యూస్ 24అవర్స్ టివి-వరంగల్ ప్రతినిధి, 07 జులై 2026: మాదిగ దండోరా ఉద్యమం మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా యువసేన అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం కోదాడ హరిజనవాడలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతాబాబు మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మొదలైన దండోరా ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ఏర్పడి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారని, వారి త్యాగఫలమే నేడు వర్గీకరణ ఫలాలను అందుకోవడం అని గుర్తుచేశారు. సమాజంలో మాదిగల పట్ల ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడంలో ఎమ్మార్పీఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఆరోగ్యశ్రీ సమస్యలపై, దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు ప్రశ్నించి, తిరగబడిన ఏకైక ఉద్యమం మాదిగ దండోరా అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కలకొండ ఆదినారాయణ, జిల్లా నాయకులు బొల్లెపోగు స్వామి, కందుకూరి నాగేశ్వరరావు, నారకట్ల ప్రసాద్, పిడమర్తి బాబురావు, ఏర్పల చిన్ని, కందుల విజయ్, సోమపంగు శ్రీను, బొల్లెబోగు చంటి, చింతా వినయ్, కర్ల సతీష్, కుడుముల వినయ్, టైగర్ గోపి, నవీన్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.