
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 04 జులై 2026: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరీ, సామాజిక దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన దొడ్డి కొమురయ్య తెలంగాణ ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని, మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్,జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, ఉప్పల రమేష్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి, కంచకట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి, మన్యం యాదగిరి, దున్న శ్యామ్, జిల్లా కార్యదర్శి టీఎన్జీవోస్ యూనియన్,స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్: నాయిని శ్రీనివాస రావు
9290 999 316,
9490 999 316.