প্রিন্ট এর তারিখঃ জুন ১৭, ২০২৬, ৩:৪৬ এ.এম || প্রকাশের তারিখঃ মার্চ ২৪, ২০২৬, ৩:২০ এ.এম
భారత రైల్వేల విద్యుదీకరణలో చారిత్రాత్మక ప్రగతి

బ్యూరో చీఫ్, న్యూస్ 24అవర్స్ టివి-24.03.2026: భారత రైల్వేలు గత రెండు దశాబ్దాల్లో విద్యుదీకరణలో భారీ ముందడుగు వేసాయి.
వివరాలు ఇలా ఉన్నాయి:
2006లో – కేవలం 27% (17,450 కి.మీ.) మాత్రమే విద్యుదీకరణ.
2016లో – 35% (23,555 కి.మీ.).
2026 నాటికి – దాదాపు 99.47% (69,744 కి.మీ.) విద్యుదీకరణ పూర్తైంది.
రైల్వేలు విద్యుదీకరణ చేయకపోతే ప్రతి సంవత్సరం భారత్ సుమారు 10 బిలియన్ లీటర్ల డీజిల్ వినియోగించాల్సి వచ్చేది. దాని ఖర్చు సుమారు ₹80,000 కోట్ల వరకు అయ్యేది.
విద్యుదీకరణ వల్ల
ఇంధన దిగుమతులు కొంత మేర తగ్గాయి. దిగుమతి చేసినవి వినియోగం తగ్గటముతో ఎగుమతులు పెరిగాయి. ఆదా చేసిన ప్రతి లీటర్ మనము ఉత్పత్తి చేసినట్లే.
కాలుష్యం తగ్గింది. డీసెల్, బొగ్గు ట్రైన్ లు కాలుష్యాన్నిము ఇచ్చేవి.
రైల్వే ప్రయాణం వేగంగా, తక్కువ ఖర్చుతో మారింది.
2020 తర్వాత జరిగిన విద్యుత్ రంగ సంస్కరణల వల్ల
విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.
విద్యుత్ ఆదా (Efficiency) మెరుగైంది.
విద్యుత్ సరఫరా స్థిరంగా మారింది.
దీంతో రైల్వేల పూర్తి విద్యుదీకరణను వేగంగా అమలు చేయడం సాధ్యమైంది.
ఇది భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక పెద్ద మైలురాయి. సహజ వనరులను జాగ్రత్తగా వాడుకుంటూ, ఆదా చేసుకుంటూ, ఉత్పత్తి లు పెంచుకుంటూ సమతుల్యత సాధించారు కాబట్టి ఇంతటి క్రైసిస్ లో కూడా ఆందోళన లేకుండా దేశాన్ని నడుపుతున్నారు.
Copyright © 2026 news24hourstv.com. All rights reserved.