By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
News 24 hours tvNews 24 hours tv
Notification Show More
Font ResizerAa
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Reading: Bird Flu: చికెన్ తింటున్నారా?.. చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది!-NEWS 24HOURS TV
Share
Font ResizerAa
News 24 hours tvNews 24 hours tv
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders
Search
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Have an existing account? Sign In
Follow US
News 24 hours tv > Blog > latest-posts > Bird Flu: చికెన్ తింటున్నారా?.. చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది!-NEWS 24HOURS TV
latest-postsఆరోగ్యం

Bird Flu: చికెన్ తింటున్నారా?.. చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది!-NEWS 24HOURS TV

NAINI SREENIVASA RAO
Last updated: February 11, 2025 9:01 am
NAINI SREENIVASA RAO
ByNAINI SREENIVASA RAO
C.E.O
C.E.O NEWS 24HOURS TV Phone: 9290999316
- C.E.O
Published February 11, 2025
Share
SHARE

న్యూస్ 24అవర్స్ టివి-హెల్త్ పేజీ, 11.02.2025: ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? పొరుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ప్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ప్లూ సోకి కోళ్లు మృత్యువాతపడుతుండగా ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రదేశ్ కు కూడా పాకింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వైరస్ ను గుర్తించారు పశుసంవర్ధన శాఖ అధికారులు. జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారినపడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ప్లూ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక, వైద్యారోగ్య, పోలీస్ తో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది.

ఈ బర్డ్ ప్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ప్లూ బైటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా వుండకూడదని, ఏదయినా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్దిరోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ప్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదముంది. కాబట్టి అహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.

ఇక పౌల్ట్రీ రైతులు కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసారు. బర్డ్ ప్లూ లక్షణాలు కోళ్లలో గానీ, మనుషులలో గానీ కనిపిస్తే 95429 08025 కు సమచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ బ్లూ బారినపడితే వెంటనే సంప్రదించాలని. వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బర్డ్ ప్లూ ఎలా సోకుతుంది?

బర్డ్ ప్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది కోళ్ళనుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది.

ఇక బర్డ్ ప్లూ సోకిన కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది. అయితే చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలాకాకుండా ఉడికీఉడకని చికెన్ తినడంద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా వున్న నేపథ్యంలో చికెన్ తినకుండా వుండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బర్డ్ ప్లూ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించగానే వైద్యసహాయం పొందడం ఉత్తమం.

బర్డ్ ప్లూ లక్షణాలు: పౌల్ట్రీ ఫారాల్లో ఒకే సారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ప్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది. బర్డ్ ప్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకిన వారు జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది వుంటుంది. ముక్కు మూసుకుపోవడం, గొంతునొప్పి, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో బర్డ్ ప్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హైఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు విరేచనాలతో ఇబ్బందిపడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి, న్యుమోనియాకు దారితీస్తుంది. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందాలి. అయితే వైరస్ సోకిన తర్వాత వైద్యం తీసుకోవడంకంటే సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచింది. కాబట్టి కొద్ది రోజులు చికెన్ కు దూరంగా వుండటం మంచిది.

5,987 Views
NAINI SREENIVASA RAO

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316

You Might Also Like

రిజిస్ట్రేషన్లు త్వరలో యుజి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మూసివేయబడతాయి, ముఖ్యమైన సూచనలను తనిఖీ చేయండి – News 24

మహిళ ఆన్ ఎయిర్ ఇండియా బ్రోకెన్ బిజినెస్ క్లాస్ సీటు – News 24

4 తెలంగాణ సొరంగంలో చిక్కుకున్న 4, 1% మనుగడ అవకాశం: మంత్రి – News 24

22 2322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది – News 24

ఆన్ లైన్ లైన్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఉండాలి – News 24

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
700Like
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
[mc4wp_form]
Popular News
ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి కట్టుబడి - ముద్రా న్యూస్
ఆరోగ్యం

ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి కట్టుబడి – ముద్రా న్యూస్ – News 24

NAINI SREENIVASA RAO
NAINI SREENIVASA RAO
March 24, 2025
ఫలితం ప్రకటించారు, ఇక్కడ ప్రత్యక్ష లింక్‌ను తనిఖీ చేయండి – News 24
యాక్సెస్ తిరస్కరించబడింది – News 24
పాఠశాల గుర్తింపు రద్దు చేసే వరకు పోరాడుతాం – News 24
జాతీయ స్థాయి స్థాయి కరాటే పోటీలలో అవినాష్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థుల విద్యార్థుల ప్రతిభ – News 24
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

About US

News24 Live TV for the latest breaking news, current updates, and top stories from India and around the world.
Quick Link
  • Home News
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Business
  • Health
  • life style
  • Wonders
Top Categories
  • latest-posts
  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Sports
  • Entertainment
  • Crime
  • Business
  • life style
  • Health
  • Wonders

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form]
©2026 . All Rights Reserved. Developed by News 24 Hours Tv.
  • About us
  • Contact
  • Blog
  • Complaint
  • Advertise
Share

Facebook

X

LinkedIn

WhatsApp

Copy Link
×
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?