
***తమ ఉనికి కోసం రౌడీ మూకలకు కొమ్ము కాస్తూ, నిరసనలు చేస్తూ పోలీసులపై చర్యలు తీసుకోవాలని అనవసర రాద్దాంతం చేస్తున్నారు…
***ఒక్కసారి ఆలోచించండి తెనాలి ప్రజలారా…

న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 01.06.2025: గత కొద్దిరోజుల క్రితం తెనాలి పోలీసులు బహిరంగంగా నడిరోడ్డుపై పట్టపగలు ప్రజల సమక్షంలో ముగ్గురు రౌడీషీటర్లకు అరికాలి ట్రీట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని కొందరు రాద్దాంతం చేస్తుండడంతో స్పందించిన పొలీసులు. రౌడీ మూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను, ప్రజలను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు తెనాలిలో రాత్రి 10 దాటిన తర్వాత సామాన్యులు ఒంటరిగా రోడ్డుపై వెళ్లాలంటే బిక్కుబిక్కుమనుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి, ఎక్కడ గంజాయి, మద్యం మత్తులో అల్లరి మూకలు దాడి చేస్తారో అని భయం, మొన్న తెనాలి లో జరిగిన ఘటనలో ఉన్న ముగ్గురు రౌడీ షీటర్లు నవీన్, జాన్ విక్టర్, రాకేష్ ల గురించి ఒక్కసారి ఆలీచించండి…
1). వేము, నవీన్ @ కిల్లర్ పై 10 కేసులు ఉండగా సంవత్సరంలో రౌడీ షీట్ ఉన్నది.
2). చెబ్రోలు, జాన్ విక్టర్, 10 కేసులు ఉండగా 2023 సం,రంలో హిస్టరీ షీట్ ఉన్నది.
3). దోమ రాకేష్ లపై 09 కేసులు ఉండి జైలుకు వెళ్లివచ్చినప్పటికి రాత్రి సమయాల్లో రోడ్లపై బైకులతో విచ్చలవిడిగా తిరుగుతూ ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు. ఎదురు తిరిగిన వారిపై దాడులు చేస్తూ ఉండేవారు, వారి ఆగడాలను ప్రశ్నించిన కానిస్టేబుల్ పైనే దాడి చేశారంటే దీనిని బట్టి వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. పోలీసులపై దాడి చేశారంటే ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు. వారికి మనం ఒక లెక్కా. ప్రశ్నిద్దామంటే అసలుకే వారి ముగ్గురు రౌడీ షీటర్లు, కొంతమంది వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, ఉనికిని చాటు కోవడం కోసం రౌడీమూకలకు కొమ్ము కాస్తూ నిరసనలు చేస్తూ పోలీసులపై చర్యలు తీసుకోవాలని అనవసర రాద్దాంతం చేస్తున్నారు.
మిగతా రౌడీషీటర్ల గురించి :
- తోమటి. ప్రశాంత్ అనే రౌడీ షీటర్ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, తన సొంత మామను చంపినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న గొంతులు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం అనవసర రాద్దాంతం చేస్తున్నారు.
- అక్రమ సంబంధం నేపధ్యంలో మాదిగ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని సముద్రాల పవన్ కుమార్ @ లడ్డూ అనే రౌడీ షీటర్ అత్యంత పాశవికంగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఆ ముక్కలను గోనె సంచిలో మూటకట్టి కాలువలో పడవేసినప్పుడు, విజయవాడలో ఒక దళిత బాలిక ముఖంపై తీవ్రంగా గాయపరచి, హింసించి ఆమెను రోడ్డుపై పడవేసి వెళ్ళినప్పుడు ఈ సంఘాలన్నీ ఏమైనాయి. ఈ నాయకులు ఇప్పుడు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు.
- ఇటీవల న్యూస్ పేపర్ లో చూడగా కానిస్టేబుల్ భార్య కూడా ఒక దళిత మహిళే అని, ఆ ఘటనలో కానిస్టేబుల్ కి జరగరానిది జరిగితే ఒక దళిత మహిళ జీవితకాలం ఆవేదన అనుభవించేది కదా…! ఈ విషయాన్ని ఈ మేధావులు ఎందుకు మరిచారు,
- తెనాలి పట్టణంలో వీరయ్య (12 కేసులు) మరియు సురేంద్ర (03 కేసులు) అనే రౌడీషీటర్ల అనుచరులుగా ఉంటూ వారి నీడలో పెరిగిన పైన తెలిపిన రౌడీషీటర్లు ఇప్పుడు సామాన్యులపై దాడులకు తెగబడుతున్నారు.
రౌడీలకు, గుండాలకు ఈవిధంగా మద్దతు ఇవ్వడం అంటే సమాజంలో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లే. కులాలు/మతాలు/పార్టీలు అంటూ చూడాల్సిన తరుణం కాదు, ఇది సంఘవిద్రోహ శక్తులను అణచివేసి సామాన్య ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సిన సమయం ఇది. కుటుంబంలో తల్లిదండ్రుల భయం, సమాజంలో పోలీసుల భయం లేకపోతే పిల్లలు చెడు నడతకు అలవాటు పడే అవకాశం వుంది.
సముద్రాల పవన్ @ లడ్డు అనే రౌడీ షీటర్ తాను పిలిస్తే రాలేదనే కారణంతో ఇంద్రజిత్ అనే వ్యక్తికి కొట్టి అతనికి చెందిన ఒక మోటార్ సైకిలు ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో తగలబెట్టాడు. ఈ కేసులో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు, తరువాత, సముద్రాల పవన్ @ లడ్డు అనే వ్యక్తి బెయిల్పై విడుదలై, మండే సంధ్యా రాణి, 26 సం.లు, మాల, కోపల్లె గుడివాడ, తెనాలి రూరల్, అనే ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి, అదే మహిళపై దాడి చేసి గాయపరిచాడు, ఇతను మొత్తం 12 క్రిమినల్ కేసులలో పాల్గొన్నాడు. తీవ్ర నేరాలకు పాల్పడిన రౌడీ షీటర్ సముద్రాల పవన్ కుమార్ @ లడ్డూ యొక్క అనుచరులే ప్రస్తుతం కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన వారు,
- వేము నవీన్ @ కిల్లర్, తెనాలి 2 టౌన్ రౌడీ షీటర్,
- చెబ్రోలు జాన్ విక్టర్, తెనాలి 2 టౌన్ రౌడీ షీటర్
- దోమ రాకేష్, తెనాలి 2 టౌన్ రౌడీ షీటర్
పై ముగ్గురు రౌడీ షీటర్ లు ప్రజా శాంతికి భంగం కలిగించే, తీవ్ర నేరాలకు పాల్పడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు ముప్పు కలుగజేస్తున్నారు. వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరములు ముఖ్యంగా ఆడవారిపై దాడులు, దారి దోపిడీలకు పాల్పడటం, గాంజాయి అమ్మకాలు, హత్యా ప్రయత్నాలు మరియు దొంగతనాలు,
ఇటువంటి వారికి మద్దతు ఇస్తే వారు భవిష్యత్తులో మరింతగా రెచ్చిపోయి ఇక వారి ఆగడాలకు అడ్డు అదుపు ఉండదు. ఇప్పటికైనా వారికి మద్దతు పలుకుతున్నవారు కుల, మతాలు, పార్టీలు వంటి వాటిని పక్కనపెట్టి తాము ఎటువంటి వారికి మద్దతు ఇస్తున్నాము?, వారికి మద్దతు ఇవ్వడం వలన సమాజానికి మంచి చేస్తున్నామా! చెడు చేస్తున్నామా! దీనివలన సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? అనే కోణాల్లో ఒక్కసారి ఆలోచించాలి.
ప్రజల స్వేచ్ఛ కోసం, సమాజ శ్రేయస్సు కోసం రౌడీలను, గుండాలను నీయంత్రించడానికి పోలీస్ వారు కొన్ని సార్లు కఠిన చర్యలు తీసుకోవలసిరావచ్చు అంత మాత్రాన దానిని విమర్శించడం సరికాదు. అసలు ఈ ఘటనలో రాజకీయ నాయకులు జోక్యం అనవసరం. ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే దానిని ప్రశ్నించడం ఎందుకు. ఈ రౌడీలు, గుండాలు 2024 సార్వత్రిక ఎన్నికల సమయం లో సుధాకర్ అనే వ్యక్తిపై వైసీపీ పార్టీకి చెందిన రౌడీ షీటర్ సురేంద్ర మరియు ఇతర రౌడీ మూకలు విచక్షణారహితంగా మూకుమ్మడి దాడి చేసినప్పుడు ఎవరూ స్పందించకపోగా ఈ రౌడీలకు మద్దతు ఇస్తూ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికైనా మేధావులు అనవసర రాద్దాంతం చేయడం మాని సామాన్య ప్రజల పక్షాన అండగా నిలబడాలని కోరుతున్నాను.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




