
న్యూస్ 24అవర్స్ టివి-చిత్తూరు ప్రతినిధి, 03.05.2025: చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ టి. సాయినాథ్ ఆద్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ నిత్య బాబు శుక్ర వారం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 19 మంది పట్టుబడ్డారు. వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో శనివారం ఉదయం ప్రవేశపెట్టగా జడ్జ్ కుమారి ఉమా దేవి 19 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం లక్షా తొంబై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ నిత్యబాబు మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడిపితే, గమ్యం నేరుగా అకాల మరణం అవుతుంది. మీ కుటుంబం కోసం మీ ప్రాణాలను కాపాడుకోండి, బాధ్యతగా ఉండండి అన్నారు. 16 నెలల వ్యవధిలో చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన 1575 మందికి సుమారు 1 కోటి 7 లక్షల 52 వేల రూపాయల ఫైన్ విధించడం జరిగింది. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, జిల్లా లోని ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలను తప్పక పాటించాలని లేదా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ నిత్యబాబు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం, ఇది మీ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుంది. మధ్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం పై సెక్షన్ 185 క్రింద మొదటి సారి నేరం చేస్తే రూ. 10 వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, లేదా రెండును విధించవచ్చు. రెండవ సారి నేరం చేస్తే రూ.15 వేలు లేదా 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా రెండును విధించవచ్చునని కావున వాహనం నడిపే సమయంలో వాహనదారులు రోడ్డు భద్రతా మరియు రహదారి నిభందనలు తప్పక పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా ఉండాలని ఇన్స్ పెక్టర్ కోరారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




