

ప్రస్తుతం ఓటీ మార్కెట్ పడిపోయిందని, పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు కూడా ఓటీ సంస్థల నుంచి బిగ్ డీల్స్ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అప్ కమింగ్ మూవీ ఓటీటీ డీల్ హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. ‘డ్రాగన్'(డ్రాగన్) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న టైటిల్ అధికారికంగా ప్రకటించడంతో పాటు.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. (ఎన్టీఆర్ నీల్)
ఇంతవరకు అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ ‘డ్రాగన్’ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు. ఏకంగా రూ.155 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
‘డ్రాగన్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు. కేవలం మొదటి భాగానికే రూ.155 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ ఓకే చెప్పినట్లు వినికిడి. ఈ మధ్య కాలంలో ఓటీటీ డీల్ పరంగా ఇదొక రికార్డుగా చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబో మూవీ.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316




